సెప్టెంబర్ 22 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన దగ్గరి నుంచి అన్నాడీఎంకే శ్రేణుల్లోనే కాదు, తమిళనాట మొత్తం ఒక్కటే ఆందోళన. పార్టీ పెద్దలు,, వైద్యులు ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఏదో కలవరపాటు. రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ సోకగా, ఈ రకం రుగ్మతకు ప్రపంచంలోనే పేరున్న బ్రిటన్ వైద్యుడిని తమిళనాడు ప్రభుత్వం రప్పించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గవర్నర్ విద్యాసాగర్ ఆస్పత్రిని సందర్శించినప్పటి నుంచి రాజకీయ వలసలు పెరిగిపోవటంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.
మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ చెన్నై రావాలంటూ జయ అంతరంగికురాలు శశికళ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి నేడు చెన్నైలో అత్యవసరంగా ఆమె సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అర్జెంటుగా రావాలంటూ సమాచారం అందుకున్న పార్టీ నేతలు జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే మరి ఈ 15 రోజులుగా పాలన సంగతి ఏంటి? ఒక ముఖ్యమంత్రి లేనిటోటును పార్టీ వర్గీయులు ఎలా పూడ్చారు?. దీనికి సమాధానం కూడా దొరికింది.
ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఆరుగురు సభ్యుల బృందం పాలనా పగ్గాలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలన గాడి తప్పకుండా చూసేందుకు, 54 ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణను ఆరుగురు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిలో జయలలితకు నిచ్చెలి శశికళా నటరాజన్, ఆమెకు దీర్ఘకాల నమ్మినబంటు, చీఫ్ సెక్రటరీ షీలా బాలకృష్ణన్, అనుకోని పరిస్థితులు ఏర్పడితే, సీఎం పీఠం ఎక్కి, ఆపై అమ్మ రాగానే నమ్మకంగా పదవిని అప్పగించే సీనియర్ నేత ఓ పనీర్ సెల్వమ్ కీలకులని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఆమె ఏరికోరి నియమించుకున్న సీఎంఓలో కార్యదర్శులు ముగ్గురు ఈ టీమ్ లో ఉన్నారని, మరే మంత్రికి కూడా నిర్ణయాధికారాలు లేవని తెలిపాయి.
కాగా, పాలనను ఇలా అనుచరులతో నడిపించడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి ప్రశ్నిస్తున్నాడు. ఆమె ఆరోగ్యం బాగానే ఉంటుందని అంటున్నారు కదా. వెంటనే ఫోటోలు విడుదల చేయండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. జయలలిత ఆరోగ్యంపై మద్రాస్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. జయలలిత ఆరోగ్యంపై వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది రామస్వామి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. గత 11రోజులుగా సీఎం జయ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జయ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది ఈ మేరకు పిటిషన్ వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more