యూరీ దాడికి ప్రతీకారంగా పీవోకేలో భారత్ జరిపిన దాడుల అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాడులకు ప్రతీకారంగా భారత్ దీటైన జవాబు ఇస్తోన్నా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సోమవారం సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉగ్రవాదులు చొరబడడంతో సరిహద్దులో భద్రతపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
పూంచ్ సెక్టార్ పరిధిలోని షహర్పుర్ లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించగా, మనోహర్ పారికర్తో భారత త్రివిధ దళాధిపతులు, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) రణబీర్ సింగ్, ఎన్ఎస్ఏ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై ఎన్ఎస్ఏ వివరిస్తోంది. మరోపక్క హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాడు.
కాగా, రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోతుండటాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్ లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి వీరు పరారుకాగా, వాటన్నింటినీ సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. ఇక వీరు తెల్లవారుఝామున తప్పించుకుని పారిపోయినట్టు గుర్తించిన సైన్యం, జీలం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో వారు నది మార్గంలో పాక్ వైపు వెళుతున్నారని గుర్తించి వారిని వెంటాడటం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛేజింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more