మనిషికి తెలివితేటలు, పరిశీలించే గుణం, ప్రశ్నించేతత్వం ఉంటాయి. కాబట్టి, ఏ ఆధారమూ లేకుండా ఏ నమ్మకాన్నీ ఏర్పర్చుకోడు. అందుకే సైన్సు (విజ్ఞానం లేదా జ్ఞానం) ముందు, మూఢనమ్మకాలని దిగదుడుపే అని భావించే అవకాశం ఉంది. కానీ, అదే సమయంలో విత్తు ముందా? చెట్టు ముందా? అనే సామెత కూడా అన్వయించుకోకతప్పదు. అందుకే ఏళ్ల తరబడి సాంప్రదాయలనే ముసుగులో ఉన్న మూఢనమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. ఆ సోదీ పక్కనబెడితే బెంగళూర్ లో జరిగిన ఓ ఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
పాము కాటుకి గురై చనిపోయిన ఓ వ్యక్తిని అతని కుటుంబం తిరిగి బతికించేందుకు ఏం చేసింది. ఓ మాంత్రికుడు చెప్పిన మాటలను పట్టుకుని వారు చేసిన పిచ్చి పనికి ఎలాంటి స్పందన లభించిందో తెలుసుకుందాం. ఖానాపూర్, అవ్రోలి గ్రామానికి చెందిన రుద్రప్ప పిలోలి(24) బుధవారం పాము కాటుకి గురై చనిపోయాడు. పోలం పనులకు వెళ్లి వస్తున్న అతన్ని పాము కరవగా, ఏదో పురుగు అనుకుని భ్రమ పడిన అతను, రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో నురగలు కక్కుకుంటూ చనిపోయాడు.
కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. బీడీ గ్రామంలో ఓ పాము తాంత్రికుడు ఉన్నాడని తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని సంప్రదించారు. ఇక అతగాడేమో ఓ బిత్తరపోయే సలహా ఇచ్చాడు. అతని మృతదేహాంపై కుప్పగా ఉప్పు పోసి ఉంచాలని, కొద్ది సేపయాక అతను ప్రాణాలతో తిరిగి వస్తాడని చెప్పారు. దీంతో నిజమని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు పోస్టు మార్టంను పక్కన పెట్టించి మరీ ఆ పని చేశారు.
గ్రామస్తులంతా విషయం తెలిసి గుంపులుగా అక్కడికి వచ్చేశారు. నేలపై శవాన్ని పడుకోబెట్టి మీద ఉప్పు కుప్పగా పోసి ఉంచారు. ఒక గంట అయిపోయింది. ఆపై మరోక గంట కూడా ముగిసింది. ఇక చివరకు మాంత్రికుడి మాటలు ఉత్తవేనని నిర్ధారించుకుని శవాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించి, ఆపై దహన సంస్కారాలు నిర్వహించారు.
మూఢనమ్మకాలూ మానవుడివే. జంతువులకు సైన్సు లేదు, మూఢనమ్మకాలూ లేవు. సైన్సును, నిజజీవితాన్ని మేళవింపు చేసుకోనంత వరకూ అలాంటి పిచ్చి నమ్మకాలు ఈ మోడ్రన్ యుగంతోపాటు సమాంతరంగా నడుస్తూనే ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more