సినిమాలు మనుషులను పెడుదోవ వైపు మళ్లిస్తున్నాయన్న విమర్శలు వస్తున్న నేటి రోజుల్లో.. వాటిని వినోదభరితంగానే చూసి వదిలేసే వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. అయితే తమను సమస్యలు వెన్నాడినప్పుడు సినిమాలు చూపించిన మార్గల్లోనే పరిష్కారాలు చేసుకునే అవకాశముంటే.. అది నిజమైన బతుకు చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడ అవిష్కృతమైంది. రాజమౌళి రూపోందించిన బాహుబలి చిత్రంలోని శివగామి పాత్రధారిణి రమ్యకృష్ణ తన బిడ్డను ఏరు దాటించేందుకు చేసిన సాహసమే.. ఇప్పుడు విశాఖ జిల్లాలోని ఓ వ్యక్తిని ప్రేరేపించి తన పసిపాపకు వైద్యాన్ని అందించేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుముకుసారికి చెందిన పాంగి సత్తిబాబుకు ఏడాది కుమార్తె వుంది. ఆ పనికూన గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అయితే అమెకు చికిత్స చేయించాలంటే తమ గ్రామ రహదారిలో వున్న కాలువ దాటాల్సిందే.. కానీ ఆ కాలువ ఇటీవలి వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకునేందుకు ఆ కాలువను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. బాహుబలి సినిమాలో పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చేకుని అచ్చంగా అలానే తన బిడ్డను ఏరు దాటించాడు..
సినిమాలు, నిజ జీవితం వేరంటూ ఆయన బంధువులంతా వద్దని వారిస్తున్నా.. తన కూతరుకు వైద్యం అందించి.. రక్షించుకునేందుకు ఆయన తీవ్రంగానే శ్రమించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడుమసారి కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న తన కుమార్తెకు వచ్చిన జర్వం అయనను లక్ష్యం వైపు నడిపించింది. పసికందును చేతుల పెకైత్తుకొని అతికష్టమ్మీద కాలువ దాటాడు. తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి మెయిన్రోడ్కు చేరుకొని లోతుగెడ్డ పీహెచ్సీకి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుడు చెప్పడంతో సత్తిబాబు ఊపిరి పీల్చుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more