స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనుకుంటూ పెరిగిన ఆ ఇద్దరు యువకుల జీవితాలు అర్థాంతరంగా ముగిశాయి. ఓ రోడ్డు ప్రమాదంలో స్నేహితుడు తన కళ్ల ముందు చనిపోవటం చూసి తట్టుకోలేని యువకుడు రైలు కింద పడి మరణించిన ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. హైదరాబాద్ లోని మూసాపేటలో జరిగిన ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే...
గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన హరికృష్ణ, రమేశ్ స్నేహితులు. వేపకంపల్లి గ్రామానికి చెందిన వీరిద్దరూ చిన్నతనం నుంచే కలిసి చదువుకున్నారు. హరికృష్ణ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రమేష్ శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో ఉద్యోగి. రమేష్ నెలక్రితమే మలేషియా నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి అమీర్ పేటలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మూసాపాటలోని గూడ్స్ షెడ్ రోడ్డులో బైక్పై వెళ్తున్న ఇద్దరు స్నేహితుల వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్పై వెనక కూర్చున్న రమేష్(28) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన హరికృష్ణ ఆ ప్రమాదం చూసి కుంగిపోయి అక్కడే కుప్పకూలిపోయాడు. తన కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. అంతే కొద్దిసేపటికే భరత్నగర్లో రైలు పట్టాల దగ్గరకు హరికృష్ణ(28) వెళ్లాడు. స్నేహితుడి లేని జీవితం తనకెందుకనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంకు సంబంధించిన వీడియో సీసీ పుటేజీల్లో నమోదైంది. అతివేగంతో వచ్చిన లారీ డ్రైవర్ దే తప్పని నిర్ధారించుకున్న పోలీసులు, డ్రైవర్ ని అరెస్ట్ చేశారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more