దేశం మొత్తం ఒకే పన్ను-ఒకే విధానం కోసం జీఎస్టీ(వస్తు సేవల పన్ను)ను ఆచరణలో పెట్టేందుకు అడ్డంకులన్నీ తొలగిపోవటమే కాదు, ఏకంగా జీఎస్టీ కౌన్సిల్ తొలిసమావేశం కూడా ఈరోజు ఢిల్లీలో ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం నుంచి జరిగుతున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు కూడా. అయితే కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి భారీగానే నష్టం ఉంటుందంటున్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ విషయాన్ని వెల్లడించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏటా రూ.150 కోట్ల నష్ణం వస్తుందని వివరించారు. అయినప్పటికీ చిరువ్యాపారులకు నష్టం రాకూడదన్న ఉద్దేశంతోనే తాము కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. మొదట రూ.10 లక్షల టర్నోవర్ పైబడిన వారికి జీఎస్టీ వర్తింపజేయాలని అనుకున్నప్పటికీ, అందరి అభిప్రాయాలు విన్న తరువాత దీనిని రూ.20 లక్షలుగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అయితే ఆర్థికవేత్తలు చెబుతున్న వాదన మరోలా ఉంది. జీఎస్టీతో ఏపీకి భారీగానే నష్టం ఉంటుందని వారు చెబుతున్నారు. సుమారు సాలీనా 4700 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని లెక్కలుకట్టి మరీ చూపుతున్నారు. కేవలం బీజేపీ కోసమే టీడీపీ తొందరపడిందని, ముందు వెనకా చూడకుండా జీఎస్టీ కోసం హడావుడి సమావేశం ఏర్పాటు చేసి మరీ నిరసనల మధ్యే ఆమోదించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక వచ్చేనెల 17, 18, 19వ తేదీల్లో రెండోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నట్లు అరుణ్జైట్లీ వెల్లడించారు. పన్నురేటు, శ్లాబ్లపై రెండో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ నెల 30న కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుందని చెప్పారు. బిల్లు వల్ల చిరువ్యాపారులకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా చర్చించినట్లు తెలిపారు. రూ.20 లక్షల టర్నోవర్లోపు ఉన్నవారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆపై టర్నోవర్ ఉన్నవారందరికీ ఈ ట్యాక్స్ వర్తిస్తుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more