తెలంగాణ బస్సులో మంటలు ఇద్దరు సజీవదహనం, ఆందోళనకారులే నిప్పుపెట్టారన్న అనుమానాలు | kaveri travels Bus fire accident 2 died

Kaveri travels bus fire accident at humnabad 2 died

Kaveri travels bus accident, Fire accident in Telangana bus, telangana Bus fire accident, Humnabad accident, Humnabad telangana bus accident, Short circuit in telangana bus two killed, two killed in bus short circuit, protesters fire to telangana bus

Telangana kaveri travels Bus fire accident 2 died.

ITEMVIDEOS:తెలంగాణ బస్సు దగ్ధం... చిన్నారి సజీవ దహనం!

Posted: 09/16/2016 09:40 AM IST
Kaveri travels bus fire accident at humnabad 2 died

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం వేకువఝామున తెలంగాణకు చెందిన ఓ బస్సు దగ్దమైన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనం కాగా, పలువురికి గాయాలయ్యాయి. షిర్డీ-హైదరాబాద్ మధ్య 29 ప్రయాణికులతో వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు హుమ్నాబాద్ ప్రమాదానికి గురికాగా, ప్రయాణికుల్లో తణుకుకు చెందిన బాలుడు రియాన్(4) చనిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం హుమ్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు.

 

అయితే ఇది ప్రమాదం కాదని, ఆందోళనకారులు నిప్పుపెట్టారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 'టీఎస్' అని ఉన్న రిజిస్ట్రేషన్ నంబరును 'టీఎన్'గా భావించా తమిళనాడు బస్సు అనుకుని నిప్పు పెట్టినట్టు వారు చెబుతున్నారు. మరో పక్క స్థానిక పోలీసులు వాటిని కొట్టిపరేశారు. బస్సు నంబర్ పీవై 01 సీకే 9552 ఉండటం దీనిని ధృవీకరిస్తోంది. కేవలం ఇంజన్ లో మంటలు చెలరేగి షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని నిర్థారణ అయినట్లు చెబుతున్నారు. ప్రమాదంపై మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను ఆరాతీస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Kaveri travels  bus  fire accident  2 died  

Other Articles