ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన వంచనపై పార్టీలకతీతంగా విమర్శలు పడుతుంటే ఢిఫెన్స్ కోసం ప్యాకేజీ ని హైలెట్స్ చేస్తూ అందులోని విషయాలను కూలంకషంగా వివరిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే రంగంలోకి దిగిన వెంకయ్య టీవీల్లో సైతం యాడ్ లు ఇవ్వటం కొసమెరుపు. ఇక ఇంకొందరైతే హోదా ఇవ్వకపోవటానికి, అందులో హామీలను నెరవేర్చకపోవటానికి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పెట్టిన పుల్లలు కారణమని వాదిస్తున్నారు.
కానీ, అదే పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాత్రం విభజన టాపిక్ గా లెవనెత్తుతూ ఇదంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేసిన ఘోరమంటూ దుమ్మెత్తిపోశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయిందని భావించిన సోనియా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపిస్తున్నాడు. మంగళవారం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన ఫైర్ అయ్యాడు. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతం నుంచి అన్ని సీట్లు తమకే వస్తాయని భావించి, తమ బిడ్డ రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాను కోరినట్లు కావూరి పేర్కొన్నారు. రాజకీయాలు చెప్పలేనంతగా చెడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలను ప్రజలు చీదరించుకునే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ముందు సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే చివర్లో గతం తల్చుకుని ఏ లాభం? ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు మరి రాష్ట్రానికి ఏం చేస్తారంటూ మీడియా నుంచి కావూరికి ఎదురు ప్రశ్నలే ఎదురుకావటంతో ఆయన మౌనంగా ఉండిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more