రైతన్నలతో ప్రధాని మోదీ ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారా..? Narendra Modi has never taken selfie with a farmer: Rahul Gandhi

Narendra modi has never taken selfie with a farmer rahul gandhi

congress, BJP, samajwadi party, BSP, vice president rahul gandhi, PM modi, election promises, uttar pradesh assembly eleection, up cm akhilesh yadac, cycle, mayawati, SP

Congress vice-president Rahul Gandhi accused Prime Minister Narendra Modi of being "anti-poor" at the end of the first leg of his Deoria to Delhi kisan yatra

రైతన్నలతో ప్రధాని మోదీ ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారా..?

Posted: 09/12/2016 08:49 AM IST
Narendra modi has never taken selfie with a farmer rahul gandhi

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ యువనేత, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోడీపై తనదైన శైలిలో విమర్శలను సంధిస్తూ ముందుకు సాగిపోతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాన మంత్రిగా ప్రమోషన్ పొందిన మోడీ.. తన రెండున్నరేళ్లలో ఎంతోమందితో దేశవిదేశీయులతో సెల్పీలు దిగారని, కానీ ఏనాడైన దేశానికి చెందిన అన్నదాతతో సెల్ఫీలు దిగారా అంటూ ప్రశ్నలు సంధించారు. కనీసం తన రాష్ట్రానికి చెందిన గుజరాత్ రైతన్నలతోనైనా ఒక్క సెల్పీ దిగారా..? అని ప్రశ్నించారు.

‘‘ఆయన అమెరికా వెళ్తారు. ఫ్రెండ్ ఒబామాను కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. అటునుంచి అటే చైనా, జపాన్ వెళ్తారు. ఆయనెప్పుడూ రైతులతో సెల్ఫీలు తీసుకోరు’’ అని ధ్వజమెత్తారు. ‘‘మోదీ సెల్ఫీలు తీసుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. దీనికి మనం పుల్‌స్టాప్ పెట్టాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రశ్నలను తాము లేవనెత్తిన తరువాత ఇప్పుడు అనేక మంది రైతులతో ఆయన సెల్పీలు దిగినట్లుగా అయన ప్రచారసాధకులు ఫోటోషాఫ్ ఫోటోలను నెట్ లో అప్ లోడ్ చేస్తారని కూడా రాహుల్ అన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందుకు విదేశాల్లోని నల్లడబ్బును తీసుకువచ్చి.. దేశ ప్రజల ప్రతీ ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయల మేర వేస్తానని చెప్పిన మోడీ కోసం ప్రజలు వేచిచూస్తున్నారని వ్యంగస్త్రాలు సంధించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలరోజల పాటు 223 శాసనసభ నియోజకవర్గాలను మీదుగా కొనసాగనున్న రాహుల్  'డియోరియా టు ఢిల్లీ' యాత్రలో భాగంగా ఆరవ రోజు ఘజీపూర్ జిల్లా బాద్సార్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు,

ఈ సందర్భంగా ఆయన బీఎస్పీ చీఫ్ మాయావతి, యూపీ సీఎం అఖిలేష్‌పైనా విరుచుకుపడ్డారు. ‘‘ ‘ఏనుగు’ అంతా తినేసింది. సైకిల్ పంక్చర్ అయింది. మాతో చేయి కలపండి. ఏం చేస్తామో చూడండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల కోసం ప్రధాని మోదీ ఏమీ చేయడం లేదని పేర్కొన్న రాహుల్.. మోదీ, ఆరెస్సెస్ కలిసి ప్రజలను కులమతాల పేరుతో విభజిస్తున్నారని ఆరోపించారు. బక్రీద్ సందర్భంగా రాహుల్ తన యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  BJP  samajwadi party  BSP  rahul gandhi  PM modi  uttar pradesh assembly eleection  

Other Articles