ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ లో అతి చిన్న వయస్కురాలైన మంత్రిగా రాకార్డులలో నిలచిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహాయమంత్రి అనుప్రియా పటేల్ అంతలోనే వివాదల పరంగా కూడా రికార్డులలో నిలవాలనుకుంటున్నారు కాబోలు. అర్థంకాలేదా..? అమె తాను ఒక కేంద్రమంత్రినని విషయాన్ని మర్చిపోయి భవన నిర్మాణం చేస్తున్న ఓ కాంట్రాక్టరు పట్ల వ్యవహరించిన తీరుతో చిక్కులను కొనితెచ్చుకున్నారు. తాను ప్రజలకు ప్రధాన సేవకుడిని అన్న ప్రధాని మోడీ క్యాబినెట్లో.. అధికార అహంభావం వున్న మంత్రిపై అటు నెట్ జనులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు ఇంతకీ అనుప్రియ పటేల్ ఏం చేశారు..? ఎందుకు అమెను విపక్షాలతో పాటు నెట్ జనులు కూడా తూర్పారబడుతున్నారు..? వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో కొత్త ఇంటిని అనుప్రియ నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణాన్ని సిపిడబ్యూడి అధికారులకు అప్పగించారు. అయితే మంత్రివర్యులు అనుకున్నంత స్పీడుగా ఇంటి పనులు జరగడం లేదు. తాను అదేశించినా అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారని మంత్రికి చిర్రెత్తుకోచ్చింది.
అంతే తన ఇంటి పనులనే అలస్యంగా చేస్తారా అంటూ ఇద్దరు సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను అనుప్రియ భర్త ఆశిష్ పటేల్ నిర్బంధించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఒక్కసారిగా దేశప్రజలను దృష్టిని అకర్షించడంతో ఆ ఆరోపణలలో నిజం లేదని, అవాస్తవమని మంత్రి కొట్టి పారేశారు. గిట్టని వారు ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా రాజకీయ కుట్రని ఆరోపించారు. కాంట్రాక్టర్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఆరోపణలను చేస్తున్నారని అమె అన్నారు. అయితే నెట్ జనులు మాత్రం మంత్రి మాటలను విశ్వసించకపోవడం ఒకఎత్తైయితే.. మంత్రి అన్న అహంకారంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శలు వెల్లివిరుస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more