ఉత్తర భారతావనిలో వరుణుడి ప్రళయకారుడిగా నృత్యం చేస్తూ.. వాగులు, వంకలు నిండి ఇళ్లను, పోలాలను కూడా చట్టుముట్టి బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన మధ్యప్రదేశ్ లోని ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తరుణంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి తాను ఊహించింది ఒకటి కాగా, అయ్యింది మరోకటి. తన హెలికాఫ్టర్ లో ముంపు ప్రాంతాల సర్వేను చేపట్టడంతో ప్రజల కష్టాలు తెలియవని అనుకున్నాడో ఏమో.. రోడ్డు మార్గం గుండానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని వారిని పరామర్శించాలని భావించాడు.
పర్యటనలో భాగంగా పన్నా ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అధికారయంత్రాంగం, పోలీసులు, మందిమార్బలంతో ఆయన పర్యటిస్తున్నారు. సరిగ్గా గ్రామానికి వెళ్లే చోట హరికాలు లోతు నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆయన వెనక్కుతగ్గారు. వరద నీళ్లలో నడిస్తే బూట్లు తడిసిపోతాయనుకున్నారో.. లేక నీళ్లలో పురుగు, పుట్ర ఉంటాయని భయపడ్డారో గానీ, నీళ్లలో నడిచేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. కానీ అక్కడివరకు వచ్చి గ్రామస్థులను కలవకుండా వెనక్కు వెళ్లేందుకు కూడా ఆయన ఇప్టపడలేదు.
వెంటనే జిల్లా ఎస్సీ, కలెక్టర్లు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంతకుమించిన మంచి అవకాశం రాదనుకున్నారో ఏమో.. ఏకంగా ఆయనను తమ పోలీసులు చేతుల మీద ఎత్తుకుని మరీ తీసుకెళ్లారు. వరద ప్రాంతాల పర్యటన కోసం వెళ్లిన ఆయన.. ఇలా పోలీసుల చేతుల మీదుగా వెళ్తూ కెమెరాలకు చిక్కారు. పన్నా జిల్లాలోని అమన్గంజ్ ప్రాంతంలో ఆయన పర్యటించినపుడు ఈ దృశ్యం కనపడింది. ఔత్సాహికులు తమ సెల్ఫోన్లలో తీసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి అక్కడ వరద నీళ్లు కూడా మరీ అంత ఎక్కువేమీ లేవు. గట్టిగా మాట్లాడితే పాదాల పైకి వస్తాయంతే.
మరోచోట బాగా మట్టిగా ఉన్న ప్రాంతంలో ఆయన కాళ్లకు ఉన్న బూట్లు తీసేసి నడుస్తుంటే, ఆయన బూట్లను మరో సహాయకుడు చేతులతో పట్టుకుని తీసుకొచ్చాడు. నీళ్లలో పాములు ఉంటే అవి ముఖ్యమంత్రిని కాటేస్తాయన్న అనుమానంతోనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు రిస్కు తీసుకోకూడదని అనుకున్నారని ఒక కథనం ప్రచారంలోకి రాగా, ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి.. ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. ఆయన కాలికి బలమైన గాయం తగిలింది. దాంతో ఆయన నడవలేకపోయారంటూ మరో కథనాన్ని ప్రచారంలోకి తీసుకోచ్చారు.
వీటిలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని నెట్ జనులు మాత్రం మూడు పర్యాయాలుగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలను తీవ్రంగా తూలనడాడుతన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా బ్రీటీష్ పాలన మాత్రం పోలేదని నెట్ జనులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మరికోందరు ఆయన ఒలంపిక్స్ 2020లో వరద రేసు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్టు మెదలు పెట్టారని ఒకరు, అయన విజయం సాధించడంతో ఆయన కోచ్ అయనను అలా తీసుకెళ్తున్నారని కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మరి దీనిపై ముఖ్యంత్రి వర్యులు నోరు తెరిచేదెన్నడో.. కారణాలను వెల్లడించేదెన్నాడో.. నంటూ ఇంకోందరు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more