రెండో దఫా అధికారంలోకి రాకుంటే రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జగన్ లో నెలకొన్న ఆందోళన తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత తన మైండ్ సెట్ ను నెమ్మదిగా మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. మోనార్క్ లా వ్యవహారిస్తూ ఎవరి మాటా వినకపోవటం వల్ల కీలక నేతలను కోల్పోవటంతోపాటు ఈ పరిస్థితి దాపురించిందని స్పెషల్ గా విశదీకరించనక్కర్లేదు. అందుకే జాతీయ పార్టీల బాటలోనే నడించేందుకు ఆయన వ్యూహారచన చేస్తున్నాడని అర్థమౌతోంది.
చాయ్ పే చర్చ నుంచి పలు అంశాల్ని ఓటు బ్యాంకుగా మార్చిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల్లో నితీష్ వెన్నంటి ప్రచార వ్యూహాల్ని రచించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం వ్యూహకర్తగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్ కిషోర్ తరహా వ్యూహకర్తల్ని జగన్ నియమించుకోబోతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ... రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిశోర్ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత భారీ విజయాన్ని బీజేపీ దక్కించుకుంది. ఆ తర్వాత సొంత రాష్ట్రం లో జరిగిన ఎన్నికలకు నితీశ్ కుమార్ కు సేవలందించి ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపైనా కూర్చోబెట్టాడు. ప్రస్తుతం యూపీ ఎలక్షన్స్ కి హస్తంకి చెయ్యి అందిస్తున్నాడు.
ఈ క్రమంలో జాతీయ పార్టీల గెలుపు మంత్రం రాజకీయ వ్యూహకర్త సేవలను వినియోగించుకునేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ప్రశాంత్ కిషోరేనా? కాదా? లేదా ఆయన అనుచర గణంలోని వ్యక్తులా? అన్నది వేచి చూడాలి. ఈ మేరకు లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more