మారుతున్న కొత్త జిల్లాల సంఖ్య తో గందరగోళం నెలకొనగా, ఎట్టకేలకు పునర్విభజన అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు జిల్లాల పునర్విభజనకు నడుం బిగించిన కేసీఆర్ ప్రభుత్వం... ఎట్టకేలకు ఆ కసరత్తును పూర్తి చేసింది. సుదీర్ఘ అధ్యయనం, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదికను బుధవారం సీఎం కేసీఆర్ కు అందజేసింది. నివేదికను మరోమారు పరిశీలించిన కేసీఆర్ ఈ ప్రతిపాదనకు దాదాపు ఓకే చేశారని, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను మొత్తం 27 జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ నివేదించింది. అదే సమయంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 44 నుంచి 74కు, మండలాల సంఖ్యను 459 నుంచి 533కు పెంచాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. పాలనపరంగా ఇబ్బందులతోపాటు, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆందోళనల దృష్ట్యా జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న ప్రాంతాలను కొత్త వాటిల్లో కలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక నివేదికపై హడావుడిగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్, అఖిలపక్షం భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అంశంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిన్న తన నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేసింది. ఈ నివేదికకు కేసీఆర్ యథాతథంగా ఆమోదం తెలిపితే... కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు కింది విధంగా వుంటాయి.
1. ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల
2. కరీంనగర్ జిల్లా... పెద్దపల్లి, జగిత్యాల
3. వరంగల్ జిల్లా... హన్మకొండ, మహబూబాబాదు, భూపాలపల్లి
4. మెదక్ జిల్లా... సంగారెడ్డి, సిద్దిపేట
5. నిజామాబాదు జిల్లా... కామారెడ్డి
6. ఖమ్మం జిల్లా... కొత్తగూడెం
7. నల్గొండ జిల్లా... సూర్యాపేట, యాదాద్రి
8. మహబూబ్ నగర్ జిల్లా... నాగర్ కర్నూలు, వనపర్తి
9. మిగిలిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలను మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more