జమ్ముకశ్మీర్ విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అక్కడ అశాంతికి, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ పై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడిన బాసిత్ను 24 గంటల్లోగా పాకిస్థాన్కు పంపించాలమని శివసేన డిమాండ్ శివసేనచేసింది.
శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ మాట్లాడుతూ.. 'ఢిల్లీలో కూర్చుని ఆ వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు. అతన్ని 24 గంటల్లోగా వెంటనే ఇస్లామాబాద్కు పంపించేయాలి. మన స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? అతనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయాన్ని, ముంబైలోని పాక్ రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పాక్ హైకమిషనర్ వ్యాఖ్యల్ని ఖండించింది.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ విషయమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్-పాక్ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more