గుజరాత్ ముఖ్యమంత్రి వ్యవహారంలో తలనొప్పులు ఎదుర్కుంటున్న బీజేపీకి మిత్రపక్షం ఆర్ఎస్ఎస్ గట్టి షాకే ఇచ్చింది. గుజరాత్ ఎన్నికలు కీలకంగా భావిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కోల్పోవటం కాదు, ఊహించని రీతిలో చిత్తుగా ఓడిపోతుందని చెబుతోంది.
బీజేపీ అనుబంధ విభాగం ఆరెస్సెస్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఇది బయపడింది. గుజరాత్ లో గోవు మాంసం తిన్నారన్న కారణంగా దళిత యువకులపై జరిగిన దాడి, పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం ఆ పార్టీకి గట్టి దెబ్బే కొట్టబోతున్నాయని సంకేతాలు పంపింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం దేశంలోనే గట్టి పట్టున్న గుజరాత్ లోనూ దారుణ ఓటమి తప్పదని అందులో తేలింది.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లుండగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... బీజేపీకి కేవలం 60 నుంచి 65 సీట్లు మాత్రమే వస్తాయట. అదే వచ్చే ఏడాది జరిగితే ఆ డ్యామేజ్ లో కొంత తగ్గే అవకాశం ఉందని, 18 ప్రధాన అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమి తప్పదని అంటోంది. దళిత యువకులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ను అమాంతం కిందకు పడేసిందని స్వయంగా కర సేవకుల చేత చేయించిన సర్వేతో తేలింది.
మరోవైపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆ రాష్ట్రంలో గిరిజనులు కూడా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఆ సర్వే డేంజర్ బెల్స్ మోగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్న నేపథ్యంలో ఈ సర్వే మరింత ఇబ్బందికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more