వర్ఛువల్ రియాలిటీ గేమ్ పొకిమాన్ గొ ప్రజలను ప్రమాదాల బారిన పడేస్తున్న ఘటనలు మనం తరుచూ చూస్తూనే వున్నాం. ఈ గేమ్ అడుతూ కొందరు రోడ్డు ప్రమాదాలకు గురైతే, ఓ వ్యక్తి ఏకంగా దేశ సరిహద్దును దాటేశాడు. అయితే ఇన్నాళ్లు అడేవారికే ప్రమాదం అనుకుంటే తాజాగా అడేవారితో పాటు వారిపై అధారపడిన వారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తుందని తాజాగా జరిగిన ఘటన రుజువు చేస్తుంది. ఓ జంట రెండేళ్ల కొడుకును ఇంట్లో వదిలిపెట్టి మొబైల్ ఫోన్లో ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని మరిచిపోయారు. పోలీసులు వచ్చి బాలుడ్ని రక్షించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఆరిజోనాలో ఈ ఘటన జరిగింది. అరిజోనాలోని సాన్ టాన్ వ్యాలీకి చెందిన యువజంట బ్రెంట్ (27), బ్రియన్నె డాలీ (25) అనే దంపతులు కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పొకిమాన్ గొ గేమ్ ఆడుతూ, వీధుల వెంటతిరుగుతూ 90 నిమిషాలు వెళ్లిపోయారు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేరు. పాపం ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి నీళ్లు కూడా అందుబాటులో లేవు. ఇంటి బయట ఏడుస్తున్న చిన్నారిని చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారించారు. తొలుత ఇంధనం కోసం కారులో వెళ్లామన్న బ్రెంట్ జోడీ.. తర్వాత అసలు విషయం ఒప్పుకున్నారు. అయితే వారిని ముందుగా అరెస్టు చేసిన పోలీసులు ఇకపై ఇలాంటి గేమ్లు ఆడేముందు వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించాలని హెచ్చరించిన పోలీసులు వారిని వదిలిపెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more