బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా అదాయపన్ను శాఖ అధికారుల నుంచి తాఖీదులు అందుకున్నారు. ఆదాయం డిక్లరేషన్ పథకం(ఐడీఎస్) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి విదేశీ సంస్థల్లో పెట్టుబడులు తదితర ఆదాయ వివరాలను ప్రకటించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దం చేసింది. రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి దేశంలోని బడాబాబులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు అప్పుడే కార్యరూపం దాల్చనున్నాచి. ఏ రూపంలోనైనా బ్లాక్ మనీని దాచిపెడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని అదేశాల నేపథ్యంలో అదాయ పన్నుశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఉన్న అప్రకటిత ఆస్తుల వివరాలను అందించాలని కోరింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 131 ఈ ఆదేశాలు జారీ చేసింది. భారతీయులకు సంబంధించిన అనేకమంది ప్రముఖుల విదేశీ అప్రకటిత ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ శాఖ మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఈ తరహా నోటీసులు జారీచేసినట్టు సమాచారం. అయితే ఊటీ నోటీసులుపై బాద్ షా బిజినెస్ మేనేజర్, రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్ కో ప్రొడ్యూసర్ కరుణ బద్వాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఐడీఎస్ పథకం విజయవంతం కోసం ప్రభుత్వం భారీ ఎత్తున కృషి చేస్తోందని.. అప్రకటిత ఆస్తులను వెల్లడి చేయని వారి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందనే సందేశాన్ని పంపుతోందని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దిలీప్ లాఖానీ వ్యాఖ్యానించారు. అయితే ఐటీ నిబంధనలను షారూక్ ఉల్లంఘించారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, గత ఏడాది మే నెలలో కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more