అయష్సు తీరకముందే ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేయాలని బావించారు కుటుంబసభ్యులు. అంటే వారేదో అయనపై కక్షగట్టి చేస్తున్న పనికాదు. ఆయన చనిపోయాడని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దృవీకరించిన తరువాతే ఇలా చేశారు. బతికున్న వ్యక్తిని చనిపోయాడని ఆ వైధ్యుడు ఎందుకు నిర్ధారించాడు. అంటే అ వ్యక్తి కోమాలోకి జారుకోవడమే అసలు కారణం. ఇంతకీ కోమాలోకి జారుకోవడానికి కారణం ఆ వ్యక్తి షుగర్ వ్యాధి గ్రస్థుడు కావడమే కారణం. షుగర్ లెవల్స్ తీవ్రంగా పడిపోవడంతో ఆయన కోమాలోకి జారుకున్నాడు. అంతే కుటుంబ సబ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో ఆయనలోకి కదలికలు గమనించి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వెంటనే అస్పత్రికి తరలించారు. ఇప్పుడాయన చికిత్సపోందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలో గురువారం అదే జరిగింది. గ్రామానికి చెందిన కాండ్రేగుల సీతారామ్ (60) రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తుంటారు. కానీ గురువారం ఆరు గంటలైనప్పటికీ లేవకపోవడంతో ఆయన భార్య లక్ష్మి ఆందోళనకు గురై స్థానిక ఆర్ఎంపీ వైద్యుణ్ని రప్పించారు. అతను పరీక్షలు చేసి చనిపోయాడని చెప్పడంతో బంధువులందరికీ కబురుపెట్టారు. సాయంత్రం అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లుచేశారు.
ఎలమంచిలి నుంచి సమీప బంధువులు రావడం ఆలస్యం కావడంతో సాయంత్రం ఐదు గంటల వరకు చూసి అంత్యక్రియలు చేద్దామని భావించారు. ఇంతలో నాలుగు గంటల సమయంలో సీతారామ్ పొట్ట కదలడంతో అనుమానం వచ్చిన యువకులు 108కి ఫోన్ చేశారు. 108 వాహనంలో ఉన్న మెడికల్ టెక్నీషియన్ అప్పలనాయుడు.. సీతారామ్ పల్స్ చూసి వెంటనే డీ-25 బాటిల్స్ రెండింటిని ఎక్కించారు. దీంతో ఆయనలో చలనం ప్రారంభమైంది.
తక్షణమే అదే వాహనంలో ఆయన్ను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సీతారామ్ వైద్య సేవలు పొంది తిరిగి మాట్లాడడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సీతారామ్ను ప్రస్తుతం విశాఖలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సమీప గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. సీతారామ్కు షుగర్ బాగా పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారని, వైద్యం అందడంతో కోలుకు న్నారని వైద్యులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more