అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా త్వరలోనే పగ్గాలను అందుకుంటారని రాహుల్ గాంధీపై స్వామిభక్తిని చాటుకుంటున్న కాంగ్రెస్ ఎంపీలు, నేతలు.. ఆయనను అబాసుపాలు కాకుండా చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్ష హోదాలో కోనసాగుతూన్న సమయంలోనే రాహుల్ గాంధీ లోక్ సభలో కునుకు తీస్తూ కెమెరాకు చిక్కారు. గుజరాత్లో దళితులపై దాడుల అంశంపైన సీరియస్గా చర్చ సాగుతున్న సమయంలో రాహుల్.. తన కుర్చీలో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో వివరణ ఇస్తుండగా రాహుల్ నిద్రపోయారు. అదే సమయంలో లోక్ సభ టీవి లైవ్ కెమెరాకు చిక్కారు.
కాంగ్రెస్ ఎంపీలు ఆయనను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఆయన నిద్రపోలేదని, కేవలం కిందకు చూస్తున్నారని వాదిస్తున్నారు. కాగా యువనేత లోక్ సభలో నిద్రపోవటం ఇదే తొలిసారి కాదు. దీంతో బీజేపీ నేతలకు ఛాన్స్ దొరకడంతో కాంగ్రెస్ యువనేతపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. లోక్సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రలోకి ఎలా జారుకుంటారని ప్రశ్నించారు. గత పదేళ్ళు పడుకున్న కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా? అంటూ సెటైర్లు వేశారు. ఇటు మీడియాలోనూ రాహుల్ నిద్రపోతున్న దృశ్యాలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక దాడికి గురైన బాధితుల్ని పరామర్శించేందుకు గురువారం రాహుల్ ఉనా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఆయన నిద్ర పోవటం ఆ పార్టీకి తలనొప్పి వ్యవహారంగానే చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ మాత్రం సభలో రాహుల్ నిద్రపోలేదని వాదిస్తోంది. చర్చ సమయంలో రాహుల్ కిందకు చూశారంటూ సమర్థించుకుంది. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించింది. కాగా గుజరాత్లోని ఉనాలో దళితులపై దాడి అంశం పార్లమెంట్ను కుదిపేస్తోంది. రెండు సభలను అట్టుడుకిస్తోంది. గోమాంసం పంపిణీ చేస్తున్నారనే కారణంతో కొందరు దళిత యువకులను బహిరంగంగా రోడ్డుపై నిల్చొబెట్టి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీని వీడియోలు బయటకు రావడంతో భారీ ఎత్తున ఆందోళన గందరగోళం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more