గురుదేవుల పట్ల శిష్యులు తమ భక్తిని చాటుకునే పర్వదినం గురుఫౌర్ణమి. ఈ గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తమ తమ ఇష్ట దైవాలు, గురువుల ఆలయాలకు వెళ్లి ప్రత్యక పూజలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడి సాయిబాబా అలయాలతో పాటు అటు గురురాఘవేంద్ర స్వామి, వేదవ్యాస, వీరభ్రహ్మేంద్ర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు.
హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్, పంజాగుట్ట, ఫిల్మ్నగర్ సాయిబాబా ఆలయాలతో పాటు పలు ప్రాంతాలలో వున్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోని ఆలయాలు సాయినామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇటు తెలంగాణలోని సిద్దిపేట్, కరీంనగర్, సంగారెడ్డి, వరంగల్, హన్మకోండ, బోధన్, నిజామాబాద్ లలో కూడా సాయి మందిరాలలో గురుపౌర్ణమి శోభ సంతరించుకుంది.
అటు మహారాష్ట్రలోని షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు. దీంతో వేకువ జాము నుంచే షిర్డీ భక్త జనసంద్రంగా మారింది. గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుక గురుపౌర్ణమి. వ్యాస పౌర్ణమినే.. గురుపౌర్ణమిగా ఆచరించాలని సాయినాథుడు ఆదేశించినట్లు భక్తుల విశ్వాసం. ఇటు కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురు రాఘవేంద్రస్వామి అలయంలోనూ భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రుని కృసా కటాక్షాల కోసం బారులు తీరారు. కర్నాటకలోని గానుగాపూర్ లో గల గురుదత్త ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. దేశంలోని పలుప్రాంతాల నుంచి గానుగాపూర్ చేరుకున్న భక్తులు అక్కడ గురుదత్తనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more