సంఘటిత ప్రజా శక్తి ముందు సైనిక తిరుగుబాటు చిత్తయ్యింది. సైన్యం పకడ్భంధీ వ్యూహాన్ని.. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపుతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు చిత్తు చేశారు. ఎర్డోగాన్ పిలుపు మేరకు ప్రజలు విధుల్లోకి రావడంతో అధికార కాంక్షతో తెగబడిన సైన్యం తోక ముడిచింది. దీంతో టర్కీలో సైనిక తిరుగుబాటునను ఆయన ప్రజాబలంతో అణిచివేయగలిగారు. మొత్తానికి ఈ ఘటనతో అధ్యక్షుడిగా తన పట్టును ఎర్గోగాన్ మరింత బిగించారు. తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ఆయన ఉక్కుపాదాన్ని మోపారు. సైన్యానికి కొత్త చీఫ్ను ప్రకటించారు. ప్రజల నుంచి కూడా మద్దతు లభించడంతో సైనిక తిరుగుబాటును తేలికగానే అణచివేయగలిగారు.
సైనిక తిరుగుబాటులో మొత్తం 161 మంది చనిపోయారు. 12 వందల మంది గాయపడ్డారు. సైనిక తిరుగుబాటు విఫలమైందని కొత్త ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. తిరుగుబాటు చేసిన 3000 మంది సైనికులను నిర్బంధించారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 29 మంది కల్నల్లను, ఐదుగురు జనరల్లపై వేటు వేశారు. టర్కీ వాయవ్య తీరప్రాంతమైన మార్మారీస్కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలో ఓ చీలిక వర్గం ఇవాళ తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది.
టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ చానెల్ను తమ అధీనంలోకి తీసుకొని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటీన తిరిగివచ్చిన ఎర్గోగాన్ వెంటనే సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. సైనిక తిరుగుబాటు దేశద్రోహచర్య అని, దీనికి కారకులు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఎర్డోగాన్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమించడంతో టర్కీకి ఎర్డోగాన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more