తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది నుంచి వినాయక నిమజ్జన కోసం ప్రత్యేక కొలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటిదాకా టాంక్ బండ్ లోనే నిర్వహిస్తుండగా, హైకోర్టు సూచనలతో కంపుతో నిండిపోయిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం కనీసం ఈ యేడాది నుంచి అయినా అందులో విగ్రహాలను పడకుండా చూడాలనే ఉద్దేశంలో ఉంది. బెంగళూరు తరహాలో ప్రత్యేక నిమజ్జన కొలనును అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
తొలుత ఇందిరా పార్క్ లోని నీటి కొలనును విస్తరించి దానికి వినాయక కొలనుగా నామకరణం చేసి వినియోగించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే భారీ వ్యయంతో కూడుకున్న పని కావటంతో ఆ ఆలోచన విరమించుకుంది. ఇక ఇప్పుడు నగర వ్యాప్తంగా చిన్న చిన్న చెరువులను అందుకు వినియోగించుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రభుత్వం అందుకు నిధులు విడుదల చేయగా, గురువారం రూ.4.90 కోట్లతో చేపట్టిన చర్లపల్లి చెరువు సుందరీకరణ పనులను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించాడు.
ఇక రూ.60 లక్షలతో చేపట్టిన గణేష్ నిమజ్జన కొలనును కూడా శంకుస్థాపన చేశారు. కాగా, హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జనం ముంబై తర్వాత స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విగ్రహాల ఎత్తు 15 అడుగులు మించకూడదని అత్యున్నత న్యాయస్థానం ఉత్సవ కమిటీలకు సూచించింది. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకూడదనే ప్రభుత్వ ఆదేశాలను ఎంత మంది పాటిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more