అమెరికాలోని డల్లాస్ లో ప్రస్తుతం నల్లజాతీయులకు పోలీసులకు మధ్య ఘర్షణతో యుద్ధ వాతావరణం నెలకొంది. అకారణంగా జాతి వివక్షతో తమ వారిని పొట్టన బెట్టుకున్నారంటూ నల్ల జాతీయులు నిరసనలు, దాడులకు దిగటం, ఐదుగురు పోలీస్ ఆఫీసర్లను మట్టుబెట్టడం తెలిసిందే. దీంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఇక ఈ అల్లర్లకు అసలు కారణంగా భావిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. డైమాండ్ రెనాల్డ్స్ అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ ఫిలాండో కాస్టిలే, నాలుగేళ్ల కూతురితో కారులో వెళ్తుండగా, అటకాయించిన ఓ పోలీస్ అధికారి వారిపై దాడికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫిలాండోయ్ పై విచక్షణ రహితంగా నాలుగు రౌండ్ల కాల్పులు జరపడం, ఆమె వద్దని ప్రాధేయపడటం అందులో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఫిలాండోయే అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే పోలీస్ అధికారికి తెలీకుండా పక్క సీట్లో ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ రెనాల్డ్స్ ఆ తతంగం అంతా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టింది. నాలుగేళ్ల వారి కుమార్తె కూడా వారిని బతిమిలాడుతుండటం అందులో గమనించవచ్చు. ఆపై ఈ వీడియో చానెళ్లలో ప్రసారం కావటంతోనే ఈ అల్లర్లకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. పది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ హత్య మొత్తం నమోదైంది. దానిని మీరూ చూడండి.
కాగా, ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ నిరసనలు కొనసాగుతుండగా, ప్రశాంతంగా జరుగుతున్న ఓ ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీ ప్రశాంతంగా సాగిందని, కాసపేట్లో అక్కడి నుంచి తాము వెళ్లాల్సివుండగా కాల్పులు జరిగాయని షెటామియా టేలర్ అనే మహిళ వివరించింది. కాగా, ఆమె తన ప్రాణాలకు తెగించి బుల్లెట్లకు ఎదురు నిలిచి తన 15 ఏళ్ళ కొడుకును రక్షించుకోగలిగింది. ఇంకోవైపు పోలీసులను చంపిన ప్రధాన నిందితుడు జాన్సన్ను కాల్పుల్లో హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more