ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 40 మంది దాకా బలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్షతగాత్రుల ఆర్తనాదాలతో భయానక పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఆ పేలుళ్ల సమయంలో ఓ బాలీవుడ్ ప్రముఖ హీరో అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
కండలవీరుడు హృతిక్ రోషన్, తన కుమారులతో ఆ సమయంలో అక్కడే ఉన్నారంట. తనయులిద్దరితో ఆప్రికా టూర వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఇస్తాంబుల్ లో ఆగారు. అయితే అది మిస్సవ్వటం, మరో ఫ్లైట్ లో సీటు దొరక్కపోవటంతో ఎకానమీ ఫ్లైట్ లో ఇండియాకు బయలుదేరారు. వీరు స్టార్ట్ అయిన కాసేపటికే పేలుళ్లు జరిగాయి. దీంతో రెప్పపాటులో మిస్సయిన హృతిక్ థ్యాంక్ గాడ్ అనుకుంటున్నాడు. ఎయిర్ పోర్ట్ సిబ్భంది చోరవ తీసుకోకపోయి ఉంటే తాము దాడిలో ఉండేవారిమంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
మతం పేరిట అమాయకులను చంపేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఇస్తాంబుల్ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, తన ఇద్దరు కుమారులు రెహన్, రిథాన్ లు ఈ ఘటన విషయం తెలియగానే భయంతో వణికిపోతున్నారంట.
Ws helped by d kindest staff at Istanbul arport hours ago. Shocking news. Innocents killed 4 religion.V must stand united against terrorism.
— Hrithik Roshan (@iHrithik) 29 June 2016
missed connecting flight at Istanbul n wer stuck at airport next flight ws next day,but took economy n flew out earlier. #Prayers4istanbul
— Hrithik Roshan (@iHrithik) 28 June 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more