బీజేపి పార్టీ నుంచి రాజ్యసభకు సభ్యత్వం లభించిన నాటి నుంచి రోజుకో వివాదాస్పదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఆయన. విపక్ష పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలపై వరుస దాడులు కొనసాగిస్తున్న ఆయన ఈ సారి తమ మిత్రపక్షమైన టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు, ఆయన మరోవరో కాదు బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని ఆయన నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తాము మిత్రపక్షంగా కొనసాగుతున్నా.. సుబ్రహ్మణ్యస్వామి తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించడం సబబుకాదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి తిరుమల అంశంపై దేశసర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టే ముందు.. తమిళనాడులోని పలు పవిత్ర పుణ్యక్షేత్రాలపై ముందుగా న్యాయస్థానాన్ని అశ్రయించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు.
కాగా, కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి దేవాలయ భూములపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం చలాయిస్తున్నాయని శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల భూములపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని అన్నారు. శ్రీవారి ఆలయంపై ప్రభుత్వ పెత్తనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దేవాలయ భూములను ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఆగడాలకు కళ్లెంవేయాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయ భూములను రక్షించుకునే బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more