అభివృద్ధే కాదు అన్నింట్లోనూ తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంటోంది. ఇప్పటి దాకా నీటి వాటాలపై కొట్టుకుంటున్న రాష్ట్రాలు, ఇప్పుడు కంపెనీలను లాక్కోవటంపై దృష్టిసారిస్తున్నాయి. పారిశ్రామిక సంస్థల ఆకర్షణలోనూ ఒకదానిపై మరోకటి పైచేయి సాధిస్తూ కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక కంపెనీని తన్నుకుపోవటం ద్వారా ఏపీ తెలంగాణను దెబ్బతీసింది.
‘హీరో మోటో కార్ప్’ కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటార్ సైకిళ్ల ప్లాంటును చేజిక్కించుకోవడంలో ఏపీ సక్సెస్ అయ్యింది. తెలుగు నేలపై ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన ‘హీరో మోటో కార్ప్’ యాజమాన్యం ముంజాల్ గ్రూప్ తొలుత తెలంగాణ సర్కారును సంప్రదించింది. ఈ క్రమంలో ఆ సంస్థకు రెడ్ కార్పెట్ పరచిన తెలంగాణ సర్కారు హైదరాబాదు సమీపంలోని మెదక్ జిల్లాలో స్థలం కేటాయింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రాయితీల విషయంలో తెలంగాణ సర్కారు నోరు విప్పలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏపీ సర్కారు భూమితో పాటు రాయితీలు కూడా ఇస్తామని హీరో మోటో కార్ప్ కు సమాచారం పంపింది. అందుకు ఆసక్తి చూపిన ఆ సంస్థ ఏపీవైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేసినా హీరో ప్లాంటు ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో అందుబాటులో ఉన్న భూమిని ఆ సంస్థ ప్రతినిధులకు చూపింది.
అందుకు ‘హీరో’ ఓకే చెప్పడంతో 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ శుక్రవారం కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఏపీ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భూ బదలాయింపు విషయంలో చర్యలకు ఉపక్రమించారు. ‘హీరో’కు కేటాయించాల్సిన భూమికి సంబంధించిన ఒప్పంద పత్రాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆయన ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఈ ఒప్పందం పూర్తి కాగానే, ‘హీరో’ తన ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more