తాలిబాన్ సూసైడ్ బాంబర్ దాడి తో సోమవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. సెక్యూరిటీ గార్డులు ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో 24 మంది చనిపోయారు. పేలుడు తీవ్రమైంది కావటంతో 327 మంది గాయపడ్డారు. పూల్-ఏ-చర్కి రోడ్లో సంభవించిన ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు ఆఫ్గన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం ఆ సంఖ్య 24 గా చెబుతున్నారు.
భారీ శబ్దంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. బాంబులు ధరించిన ఓ వ్యక్తి బస్సు సమీపంలోకి కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారంతా నేపాల్ సెక్యురిటీ గార్డ్స్ గా తేలింది. .మరికొంత మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఆత్మాహుతి దాడిని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ లో తీవ్రంగా ఖండించారు. నేపాల్ సెక్యూరిటీ గార్డులు ప్రయాణిస్తున్న మినీబస్సుపై దుండగుల అత్మాహుతి దాడి హేయమైన చర్య. ప్రమాదంలో 14మంది సెక్యూరిటీ గార్డుల మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు నేపాల్ ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more