తెలంగాణలో మరో కీలక ప్రాజెక్టు! | Parrikar laid foundation stone for Tata Boeing Aerospace Center

Parrikar laid foundation stone for tata bouncing aerospace center

Manohar Parrikar, defence minister parrika laid foundation stone for Boeing Co and Tata Advanced Systems, parrikar in telangana, తెలంగాణలో మరో కీలకప్రాజెక్టు, బోయింగ్ ఏరో స్పేస్ టాటా సన్స్, టాటా బోయింగ్ ఏరో స్పేస్ యూనిట్ తెలంగాణ, ఆదిభట్ల సెజ్, పారీకర్ తెలంగాణ, రక్షణ మంత్రి తెలంగాణ, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, KTR parrikar, telugu news, telangana latest

Union Minister Manohar Parrikar and KTR laid foundation stone for Boeing Co and Tata Advanced Systems.

తెలంగాణలో మరో కీలక ప్రాజెక్టు!

Posted: 06/18/2016 04:10 PM IST
Parrikar laid foundation stone for tata bouncing aerospace center

పారిశ్రామిక రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న తెలంగాణ మెడలో మరో మణిహరం పడింది. ఇప్పటికే టాప్ కంపెనీలు తమ యూనిట్లను రాష్ట్రంలో ప్రారంభించగా, తాజాగా టాటా గ్రూపుల నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆ జాబితాలో చేరింది. బోయింగ్ ఏరో స్పేస్ పేరిట భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చేపడుతున్న కీలక ప్రాజెక్టుకు తొలి అడుగు హైదరాబాద్ వేదికగా పడింది.



ఆదిభట్ల సెజ్ లో శనివారం ఈ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ భూమి పూజ చేశారు. టాటా బోయింగ్ ఏరో స్పేస్ యూనిట్ లో విమానాలు, హెలికాప్టర్ విడిభాగాలు తయారు కానున్నాయి. తొలి విడతగా ఈ ప్రాజెక్టు కోసం టాటా సన్స్ రూ.200 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులను అనుకూలంగా ఉన్న తెలంగాణకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలివస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని మంత్రి పారికర్ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manohar Parrikar  telangana  Boeing Co and Tata Advanced Systems  KTR  

Other Articles