ఏదో మాములు వ్యక్తి పైత్యంతో ఇలా చేశాడంటే అర్థం ఉంది. కానీ, ఓ దేశానికి ప్రధాని అయి ఉండి ప్రజా ధనాన్ని ఇలా వృథా చేశాడు. పోనీ అది స్వదేశంలోనా అంటే వేరే దేశానికి వెళ్లి అక్కడ తన చేతికి ఎముక లేదని చూపించుకున్నాడు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు తనకు అలవాటైన చేష్టలతో(గతంలో చాలా సార్లు ఇలాంటి విమర్శలు వచ్చాయి) ఇప్పుడు ప్రతిపక్షాల నోటికి పని చెప్పేలా చేశారు. తాజాగా ఐరాస సమావేశాల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ పెట్టిన దుబారా ఖర్చుపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కేవలం హెయిర్ కటింగ్ కోసం లక్ష రూపాయలు వెచ్చించడంతోపాటు, దుస్తులను ఐరన్ చేయించుకునేందుకు 15 వేలు, తిండికి రూ. 1.25 లక్షలు, ఫర్నీచర్ వాడకానికి రూ. 13 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇదంతా కేవలం ఐదు రోజుల్లోనే ఆయన ఖర్చు చేశారంట. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది ఈ విషయాలను రాబట్టాడు. 'ఇది ప్రజాధనం.. అంటే నా డబ్బు. దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే హక్కు నాకు ఉంది. సామాన్యుల గురించి పట్టించుకోకుండా నెతన్యాహూ, ఆయన భార్య సారా విలాస జీవితం గడుపుతున్నార'ని సచార్ పేర్కొన్నాడు.
ప్రశ్నించిన వెంటనే తనకు సమాధానం రాలేదని, చివరకు జరూసలెం కోర్టు కలుగుజేసుకోవటంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని ఆయన చెప్పుకోచ్చాడు. మొత్తం రూ. 4 కోట్ల ప్రజాధనాన్ని పర్యటన పేరిట బెంజిమెన్ దుబారా ఖర్చు చేశారని ఆరోపిస్తున్నాడు. ఆయన ప్రజల సోమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. కాగా, ఈ ఆరోపణలపై స్పందించేందుకు నెతన్యాహూ ప్రతినిధి నిరాకరించారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more