రూ.లక్షను రూ.రెండు లక్షలు చేస్తానంటూ రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న దొంగ బాబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు, పూజలు, వ్రతాల పేరుతో భక్తులను ముగ్గులోకి దింపి ఉడాయించిన బురిడీ బాబాను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. రేపు అధికారికంగా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించే అవకాశముంది. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బురిడీ బాబాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ బాబా నిన్న రాత్రే బెంగళూరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
చోరీ అనంతరం పరారైన బాబా బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను హైదరాబాద్కు తరలిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న లైఫ్ స్టైట్ బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డిని బురిడీ కోట్టించడంతో నకిలీ బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన బుడ్డప్పగారి శివగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి నగలు, నగదు ఉన్న మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పూజలు, పుణ్యకారాలతో మీకు ఉన్నదానికి రెట్టింపు కలిసి వస్తుందని, అందుకుగాను తన బురిడీ విద్యను చూపించి.. అలానే బంగారాన్ని, నగదును కూడా రెట్టింపు చేస్తానని నమ్మబలకడంతో పలువురు భక్తులు ఈ బురిడీ బాబా మాటలను నమ్మి మోసపోయారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఇతనికి సంబంధించిన చిట్టాను పోలీసులు విప్పారు.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ బురిడీ బాబా జాబితా..
* రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్చల్
* నెల్లూరులోనూ లక్ష్మీదేవి పూజల పేరుతో రూ.40 లక్షలు అపహరించాడు.
* చిత్తూరు జిల్లా అలిపిరి పోలీస్ స్టేషన్లోనూ ఓ కుటుంబాన్ని మోసం చేసిన కేసు
* తాజాగా, మధుసూదన్రెడ్డి కుటుంబాన్ని కోటి 30 లక్షల మేర మోసం చేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more