mudragada pabmanabham health condition detoriates on eight day of his hunger stirke

Mudragada pabmanabham hunger strike reaches eight day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike

Kapu caste leader Mudragada padmanbham says he wont break his fast untill the government comes forward to fullfill eleection promises amid his health condition detoriates on eight day.

ముద్రగడకు ఐవి ఫ్లూయిడ్స్.. అయినా క్షీణిస్తున్న అరోగ్యం..

Posted: 06/16/2016 07:07 AM IST
Mudragada pabmanabham hunger strike reaches eight day

కాపు కులస్థులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఎనమిదవ రోజుకు చేరుకుంది. ఆయన అరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో జాల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు బలవంతంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని వైద్యులు చెప్పారు. అయితే ముద్రగడ మాత్రం ఐవీ ఫ్లూయిడ్స్ వద్దని తిరస్కరించారని సమాచారం. ఏడు రోజులుగా మంచినీళ్లు కూడా తీసుకోకుండా అమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ శరీరంలో కీటోన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

దీంతో ఆయన అరోగ్య పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంటుందని.. ఈ నేపథ్యంలో అయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నంత మాత్రాన ఆయన అరోగ్యం మెరుగవ్వదని.. ఆయన త్వరలోనే దీక్ష విరమించి.. వైద్య సాయం తీసుకోవాలని వైద్యులు అంటున్నారు.

పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బాస్ లు కలసి ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ముద్రగడ మాత్రం తన దీక్షను కొనసాగిస్తున్నారని కాపు నేతలు చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారని, ఆయన ఐవీ ప్లూయిడ్స్ తీసుకోవంతో దీక్ష విరమించినట్లేనని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చిన్నరాజప్ప చేసిన వ్యాఖ్యలను కాపు జేఏసీ నేతలు తోసిపుచ్చారు. కాపులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చవకు దీక్ష కోనసాగుతుందని కాపులు నేతలు చెబతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles