సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఏవియేషన్ పాలసీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన విమానయానం ఇకపై ఉన్నత మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు గగనవీధుల్లో విహరించే విమానాలను చూసి సంబరపడిన మధ్యతరగతి వర్గాలు ఇకపై గంటలోపు ప్రయాణం వున్న పట్టానాలకైనా విమానంలో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ముసాయిదా పాలసీకి కొన్ని మార్పు చేర్పులు చేసి కొత్త జాతీయ విమానయాన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ నేషనల్ సివిల్ ఏవియేషన్ విధానానికి ఆమోద ముద్ర వేసింది, ఇది ఆ రంగంలో ప్రధాన మార్పులకు నాంది అవుతుందని ట్వీట్ చేశారు. ఈ కొత్త విధానం వివరాలు పూర్తిగా వెల్లడి కాకపోయినా, 5/20 నిబంధన స్థానంలో కొత్త నిబంధనను చేర్చినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీ ప్రోత్సహించడానికి, కార్గో ఆపరేషన్లు పెంచడానికి చర్యలతో పాటు, విదేశాల్లో నడిపే విమానాలకు అనుమతించే నియమాలలో కొన్ని మార్పులు చేసినట్టు విమానయాన మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (ఆర్ సీఎస్) కింద విమాన టికెట్ గంటలోపు రూ. 2500, అరగంటలోపు అయితే రూ. 1,200గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద విమానయాన సంస్థలు రూ 8,000 చెల్లించాలనే ఒక ప్రతిపాదన తొలగించింది. 5/20 నిబంధన ప్రకారం ఐదేళ్ల ఫ్లయింగ్ సర్వీసుతోపాటు, కనీసం 20 విమానాలు కలిగి ఉన్న సంస్థకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు అందించే వీలుంటుందనే నిబంధనలో ఐదేళ్ల సర్వీసును తొలగించింది.
దీంతో ఎయిర్ ఏసియా ఇండియా, విస్తారా లాంటి సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. దీనిపై విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. మరోవైపు కొత్త ఏవియేషన్ విధానాన్ని ఆమోదించిన కేంద్ర విమానయాన సంస్థలకు తీపి కబురు అందించడంతో విమానయాన రంగ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ తదితర షేర్లు దూసుకుపోతున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more