mudragada pabmanabham health condition detoriates on seventh day of his hunger stirke

Mudragada pabmanabham hunger strike reaches seventh day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike

Kapu caste leader Mudragada padmanbham says he wont break his fast untill the government comes forward to fullfill eleection promises amid his health condition detoriates on seventh day.

విషమిస్తున్న ముద్రగడ అరోగ్యం.. చర్చలు విఫలం..

Posted: 06/15/2016 07:04 AM IST
Mudragada pabmanabham hunger strike reaches seventh day

కాపు కులస్థులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఏడవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషమించిందని సమాచారం. వైద్యానికి నిరాకరిస్తూ.. ఐవీ ఫ్లూయిడ్స్ ను కూడా పెట్టకూడదని వైద్యులను అదేశిస్తున్న ముద్రగడ శరీరంలో కీటోన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముద్రగడ తక్షణం వైద్య సాయం తీసుకోవాలని వారు తెలిపారు.

కనీసం మంచి నీళ్లైనా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నా వాటిని ఆయన లక్ష్య పెట్టడం లేదు. ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని, హామీలను నెరవేర్చే వరకూ తాను చేపట్టిన అమరణ దీక్ష విరమించేది లేదని ముద్రగడ పద్మనాభం తాజాగా ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. ముద్రగడ తరుఫున కాపు జేఏసీ, ప్రభుత్వం మధ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తుని ఘటనలో అరెస్టయినవారి విడుదల, ఇకపై అరెస్టుల నిలుపుదల డిమాండ్లు అంగీకరించే వరకూ దీక్ష విరమించబోనని ముద్రగడ తేల్చి చెప్పారు.

డిమాండ్లపై జేఏసీ నేతలు రెండో దఫా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో చర్చించారు. ప్రభుత్వం తరుఫున ఈ చర్చలకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ హాజరయ్యారు. అయినా చర్చలు కొలిక్కిరాలేదు. తుని ఘటనలో నమోదైన కేసుల పునర్విచారణ, అరెస్టుల నిలుపుదల అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జేఏసీ నేతలకు జాయింట్ కలెక్టర్ వివరించారు. దీంతో చర్చలు ఇవాళ్టికి నాటికి వాయిదా పడ్డాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles