పవర్ కట్ లేని రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దుతానని కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో అదంతా అయ్యే పనేనా నుదుటితో వెక్కిరించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఆ అనుమానాలను పటాఫంచల్ చేసేశారు. ఈ యేడాది ఇప్పటికే కోతలు గణనీయంగా తగ్గించిన సర్కార్ కి ఈయేడు వర్షాలు విపరీతంగా ఉంటాయనే సూచనతోపాటు, నీటి ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పనలో ఇప్పటికే అడుగు పడటం కలిసొచ్చే అంశాలు. వెరసి రాబోయే రోజుల్లో కోతలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ విషయం ఏమోగానీ ఈ యేడాది విద్యుత్ కోతల విషయంలో దేశ చరిత్రలోనే నిలిచిపోనుంది.
దశాబ్దంగా ఎన్నడూ లేనంతగా ఈ యేడాది మన దేశంలో విద్యుత్ కోతలు లేకుండా ఉన్నాయంట. పీక్ అవర్స్(అత్యవసరం సమయంలో) లో సైతం 3.1 శాతం అదనపు విద్యుత్ ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విద్యుత్ అధారిటీ సంకేతాలు పంపింది. భారత్ లో విద్యుత్ కొరత లేకుండా, మిగులు విద్యుత్ నమోదు కావడం ఇదే తొలిసారి. 2015-16లో పీక్ అవర్ లో 3.2 శాతం కొరత నమోదైనట్లు, కానీ, ఈ సంవత్సరం దాన్ని అధిగమించినట్లు అధికారులు చెబతున్నారు. బొగ్గు లభ్యత అధికంగా ఉండటంతో థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ద్వారా పెరిగిందని. అంతేగాక పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని అందించడం తద్వారా అన్ని రాష్ట్రల సహకారంతో ఈ ఫీటు సాధ్యమయిందని వారంటున్నారు.
కాగా, ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ మిగులు నమోదు కావడం మోదీ టీమ్ సాధించిన పెద్ద ఘనతగా విద్యుత్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సగటున మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ, కొన్ని రీజియన్లలో మాత్రం విద్యుత్ కోతలు కొనసాగించాల్సి వస్తోందని అధికారులు వివరించారు. కాగా, ఇదేమీ ఎన్డీయే ఘనత కాదని, తాము తీసుకున్న చర్యల ఫలితమే నేడు విద్యుత్ మిగులుకు కారణమని కాంగ్రెస్ నేత, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వ్యాఖ్యానించాడు. కారణం ఎవరైతేనేం మొత్తానికి అధికారికంగా 2016-17 విద్యుత్ కోతలు లేని సంవత్సరంగా చరిత్రలో నిలవనుంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more