దేశ రాజధాని ఢిల్లీలో ఓ విదేశీ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై అమె తన స్నేహితులతో కలసి దాడి చేసిన నేపథ్యంలో అమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ఓలా క్యాబ్ డ్రైవర్పై ఆరుగురు ఆఫ్రిక న్లు దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి నైజీరియాకు చెందిన జానెట్(26) అనే యువతిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో రువాండాకు చెందిన కెఫా అనే మహిళను ఘటన జరిగిన రోజునే అరెస్టు చేశారు.
వీరివురు నిందితులు తమ వీసా గడువు ముగిసినప్పటికే దేశంలో యధేశ్చగా నివసిస్తు.. దేశీయ క్యాబ్ డ్రైవర్లపై దాడులకు పాల్పడుతూ తిరుగుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, కెఫా ఇదివరకే ఒకసారి బెంగళూరులో అరెస్టు అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జానెట్కు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం...గత 30న ద్వారక వెళ్లేందుకు కెఫా, జానెట్లు ఓలా సర్వీసెస్కు చెందిన క్యాబ్ను బుక్ చేసుకున్నారు.
క్యాబ్ రాజ్పూర్ ఖుర్ద్ వచ్చేసరికి ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అతడి కోసం వేచిచూస్తున్నారు. వారందరూ మద్యం తాగి ఉన్నారని డ్రైవర్ ఆరోపించాడు. నలుగురి కంటే ఎక్కువ మంది క్యాబ్లో తీసుకెళ్లేందుకు కుదరదని అతడు చెప్పడంతో వారితో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఆఫ్రికన్లు తనని తీవ్రంగా కొట్టారని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నలుగురు నిందితులను కూడా గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more