ఆంధ్ర పాలనలో పైసా అడుక్కునే పరిస్థితిలో ఉండేవాళ్లం. అసలు రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో చేస్కోండి అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు సొంతంగా మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నాం ఇది రెండేళ్లలో మన రాష్ట్రం సాధించిన ప్రగతి అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా గన్ పార్క్ వద్ద మంత్రులతో కలిసి అమర వీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అటు నుంచి లుంబినిపార్క్ లో అమరుల మెమోరియల్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తొలుత తెలంగాణ రాష్ట్ర అవతరోణత్సవం సందర్భంగా ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ద్విత్వియ శ్రేణి పౌరులుగా బతికాం. నీళ్లు, నియామకాలు, నిధులే లక్ష్యంగా ఉద్యమాన్ని సాగించి, రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. సమైక్య పాలనలో అవమానాలు ఎదుర్కున్నాం. తెలంగాణ ప్రజలు ఆకలి చావులకు గురయ్యారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్థిక స్థితి మెరుగుపడింది. మేనిఫెస్టో వాగ్ధానాలను అమలు చేస్తూ ఈ రెండేళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించాం. ప్రజల అవసరాలను బట్టి మేనిఫేస్టోలో కొన్నింటిని ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం. విద్యుత్ సమస్యను త్వరగా అధిగమించాం. మిషన్ భగీరథ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలవటం తమ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం’’ అని పేర్కొన్నారు. రైతన్నకు, విద్యార్థులకు, మహిళలకు, ఏ ఒక్కరినీ వదలకుండా తమ ప్రభుత్వం అందరి భాగోగుల కోసం కృషి చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్బంగా రెండేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు, అవి సాధించిన విజయాలను ఆయన వివరించారు. అంతేకాదు భవిష్యత్తులో చేపట్టబోయే మరి కొన్నింటిని ఆయన ప్రకటించారు.
- హైదరాబాద్ లో మరో 3 లేదా 4 ఆస్పత్రులు. 24
- వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద టెక్సటైల్ పార్క
- ద్వితీయశ్రేణినగరాలకు ఐటీ విస్తరణ
- దసరాలోగా కొత్తజిల్లాల ఏర్పాటు. వీటితోపాటుగా రెవెన్యూ మండలాల ఏర్పాటు
- హైదరాబాద్లో జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ
- తాము తలపెట్టిన ప్రాజెక్టులను అనుకున్న లక్ష్యంలోపే పూర్తి చేస్తామని తెలిపారు.
- స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఇంతవరకు సంపూర్ణ అక్షరాస్యత శాతం సాధించకపోవటం సిగ్గుచేటు. అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. .
- తెలంగాణలో 33 ఒకప్పుడు 33 శాతం అడవులు ఉండేవి. కానీ, ప్రస్తుతం 23 శాతమే ఉన్నాయి. అందుకే హరితహారం అనే పథకానికి చేశాం. వానలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలే... అనే నినాదంతో, ప్రతినియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కలు నాటాలని ప్రజలకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
పొరుగు రాష్ట్రాలు మనకు బాగానే సహకరిస్తున్నాయన్న ఆయన ఏపీ మాత్రం ప్రాజెక్టులకు మోకాలు అడ్డుపెడుతోంది. అయినా ఫర్వాలేదు, చర్చలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు యత్నిస్తాం. వినకపోతే న్యాయపోరాటానికి దిగుతామని చెప్పారు. కొత్త రాష్ట్రంలో పునాదులు ఎంత గట్టిగా ఉంటే, రాబోయే తరాలకు అంత మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోంది’’ వివరించారు. బంగారు తెలంగాణ కోసం స్పష్టమైన విజన్ తో ముందుకెళ్తున్నామని ఆయన ఉద్ఘాటించారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more