sachin, chiranjeevi, nagarjuna affered special prayers to tirumala balaji

Rajyasabha mps and tollywood celebs in tirumala

tirumala tirupati, rajya sabha members, sachin tendulkar, chiranjeevi, Nagarjuna, allu aravind, nimmagadda prasad, vip break darshan,

Rajyasabha members sachin tendulkar and chiranjeevi along with toolywood celebriites nagarjuna, allu aravind affered prayers to tirumala balaji

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సచిన్, చిరంజీవి, నాగ్,

Posted: 06/01/2016 06:41 AM IST
Rajyasabha mps and tollywood celebs in tirumala

తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు ఇవాళ వేకువ జామున దర్శించుకున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులు సచిన్ టెండుల్కర్ దంపతులతో పాటు మరో రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి ఆలయంలోకి స్వాగతం పలికారు.

ఇందుకోసం క్రితం రోజు రాత్రే వీరంతా తిరుమలకు చేరుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆయన సతీమణి అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత  బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు  ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. వారు తమ కారులో ముందుగా తిరుమల బయల్దేరి వెళ్లగా, ఆ తరువాత చిరంజీవితో పాటుగా తెలుగు సినీ ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.

ఇవాళ వెకువ జామును వీరంతా కలసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, ఆయనకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఇదిలా వుండగా త్వరలో వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో, భక్తులు తీరుమలకు పోటెత్తుతున్నారు. ఇవాళ కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles