ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అశావహుల నుంచి అందినకాడికి డబ్బుగుంజి అటు ఉద్యోగమూ లభించక, ఇటు డబ్బులు రాక అప్పడప్పుడూ నిరుద్యోలు తీవ్రమనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి సందర్భంలో నిరాశకు గురై పలువురు ఆత్మహత్యల దిశగా కూడా పయనిస్తుంటారు. ఎందుకంటే డబ్బు తీసుకున్న వారి మాజీ ఎమ్మెల్యే సతీమణి అయితేనో, లేక రిటైర్డు డీఎస్సీ అయితేనో వారినెదురించలేక ఇలాంటి దారునాలకు పాల్పడుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది అయితే నిందితురాలిని అరెస్టు చేశారు పోలీసులు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గండి బాబ్జీ సతీమణి రిటైర్డ్ డీఎస్పీ కొండపల్లి విజయను ఇలాంటి కేసులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2013లో విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసమున్న సమయంలో కొండపల్లి విజయ విజయవాడకు చెందిన ఎం.గిరీశం రెడ్డి, జి.గోపిరెడ్డి, ఎన్.అప్పనాయుడు, బి.జగన్నాథరావు అనే కూరగాయల వ్యాపారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అందుకుగాను వారి వద్ద నుంచి రూ.4.08 లక్షలు తీసుకున్నారు. ఆరు నెలల తరువాత ఆమె సిరిపురంలో ఇళ్లు ఖాళీ చేసి మరో చోటకి వెళ్లిపోయారు. నాటి నుంచి ఆమె ఆచూకీ కోసం బాధితులు గాలించారు.
జాడ లేకపోవడంతో అప్పటి పోలీసు కమిషనర్ అమిత్గార్గ్కు కొండపల్లి విజయపై బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే నాటి నుంచి మొన్నటి వరకు విజయపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్తగా వచ్చిన విశాఖ నగర కమిషనర్ యోగనంద్ను బాధితులు శనివారం కలసి... పరిస్థితిని వివరించారు. దీంతో నగర కమిషనర్ సూచన మేరకు మాజీ డీఎస్పీ విజయపై బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన మూడో పట్టణ సీఐ వెంకటరావు చెల్లెలు ఇంట్లో ఉంటున్న మాజీ డీఎస్సీ విజయను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more