ఆత్మహత్య చేసుకోవాలని బోనులో దూకిన వ్యక్తి రెండు సింహాల మృతికి కారణమయ్యాడు. సింహాల బోనులోకి దూకి ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న ఓ 20 ఏళ్ల యువకున్ని కాపాడే ప్రయత్నంలో చిలీలోని జూ అధికారులు తప్పనిసరి పరిస్థతుల్లో రెండు సింహాలను కాల్చి చంపారు. వివరాలు.. చిలీలోని జూలో ఆఫ్రికా సింహాలను ఉంచిన బోణులోకి ఓ వ్యక్తి దూకి బట్టలు విప్పాడు. అనంతరం అతను బోనులో దిగిన కొద్దికే సింహాలు అతనిపై దాడి చేసి పడేశాయి.
సమాచారం అందుకున్న జూ అధికారులు వెంటనే భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు జూ ప్రధాన అధికారులు తెలిపారు. అతను బోనులో పడగానే ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేసి పడేశాయి. మత్తు మందు కలిగిన బాణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపాల్సి వచ్చిందని జూ అధికారులు తెలిపారు. తీవ్రగాయాలైన బాధితుడిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఆత్మహత్యకు ప్రయత్నించిన అతన్ని ప్రాంకో లూయిస్గా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తెలియరాలేదు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణమై వుండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూ అధికారులు ప్రాంకో జేబులో సూసైడ్ నోట్ను కనుగొన్నారు. మరోవైపు జూ అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అతను బోణులో ప్రవేశించిన తర్వాత కొద్దిసేపటి వరకు సింహాలు అతనిపై దాడి చేయలేదని వారు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more