బ్యాంకుల నుంచి రుణాలు పోంది విదేశాలలో అస్తులను కూడబెట్టారన్న ఈడీ అరోపణల నేపథ్యంలో ఇక తాను ఇప్పట్లో భారత్ కు రానని తేల్చిచెప్పిన వ్యాపార వేత్త, ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా.. ఇదిగో వస్తున్నా..అదిగో వస్తున్నా అంటూ మళ్లీ ఊరిస్తున్నాడు. అయితే కొన్ని ప్రత్యేక షరతులతో.. తనకు పూర్తి భద్రత కల్పిస్తే వస్తానంటూ కొత్త రాగం అలపిస్తున్నాడు. ఇన్నాల్లు బ్యాంకులకు రుణం తీరుస్తాను.. అయితే కొద్దిగానే అంటూ అప్పు పోందిన రుణాలపై తిరిగి చెల్లింపుల విషయంలో తానే బ్యాంకులను శాసించే స్థాయిని కనబర్చిన మాల్యా.. ఇంటర్ పోల్ ను ఈడీ ఆశ్రయించిన నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చేస్తానని ప్రకటించాడు.
యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా రక్షణకు సరైన హామీ లభిస్తే త్వరలోనే తాను ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు. అయితే భారత ప్రభుత్వం నుంచి తనకు భద్రత, స్వేచ్ఛ, రక్షణకు సంబంధించి హామీ లభిస్తే ఇండియా తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినట్టు సమాచారం. రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యా ప్రతిపాదనలకు బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు మరో ఇండిపెండెంట్ ప్రతినిధి సీవై పాల్ వెల్లడించారు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది జీతాల చెల్లింపునకు తాను చేసిన ప్రయత్నాలు తన ఆస్తులు సీజ్ చేయాలనే కర్నాటక హైకోర్టు నిర్ణయం మూలంగా విఫలమయ్యాయన్నారని చెప్పారు.
ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం తనపై వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. మనీ లాండరింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మాల్యా వాదించారనీ, ఆధారాలు లేని ఆరోపణలని కొట్టి పారేసారని తెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానాకి 9 వేల కోట్లకు పైగా బకాయి పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా, రుణాల చెల్లింపుకు గడువుల గడువుల మీద విధిస్తూ బేరసారాలకు దిగాడు. ఆయన ప్రతిపాదనలకు కన్సార్టియం ససేమిరా అనడంతో వివాదం మరింత సాగుతోంది. అటు మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రశ్నించేందుకు ఈడీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు, గోవాలోని ఆయన విల్లా స్వాధీనం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more