మూడాచారాలు కాలం చెల్లిందని ఎంత పైకి చెప్పుకుంటున్నా.. వాటి ప్రబావాన్ని అవి చాటుకుంటున్నాయి. వర్షాలు పడాలని, కప్పలకు పెళ్లిళ్లు చేసే వారు లేకపోలేదు. అలా అని ఎద్దులకు, శునకాలకు కూడా పెళ్లిళ్లు చేసే వారు వున్నారు. వీటన్నింటి వెనుక బలంగా వున్నది మాత్రం మూడనమ్మకమే. ఈ అంధవిశ్వాసంలో బతుకుతున్న వారికి మూడాచారాలకు దూరంగా తీసుకెళ్తామని చెబుతున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితం కావడంతో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి దారుణ వార్తలు వెలుగుచూస్తూనే వున్నాయి.
అది ప్రపంచంలో ఎక్కడైనా కానివచ్చు. భారత దేశమే కాదు అటు అభివృద్ది చెందుతున్న దేశాలైనా, అభివృద్ది చెందిన దేశాలైనా ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం పరిపాటిగా మారింది. 20వ శతాబ్దంలోకి మానవుడు వచ్చినా.. మూడాఛారాలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప.. వాటి అడ్రస్ గల్లంతైన ఘటనలు మాత్రం అరుదు. తాజాగా చైనాలో ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం మరణించిన తమ కుమారుడి ఆత్మ శాంతించేందుకు షాంగ్జీ రాష్ట్రంలోని ఒక కుటుంబం ఒక మహిళ మృతదేహంతో పెళ్లి జరిపించింది.
కొడుకు పెళ్లికాకుండా బ్రహ్మచారిగా మరణించినందుకు ఈ తంతు జరిపింది. దీనికోసం ‘వధువు’ కుటుంబానికి రూ.18 లక్షలు ఇచ్చారు. అదేనండీ మరోలా చెప్పాలంటే కన్యాశుల్కం. మామూలుగా అయితే అంతకంటే ఎక్కువే సమర్పించుకోవాలట.అయితే, వారు స్థానికులు కావడంతోపాటు మరణించిన ‘వధువు’ కుటుంబం దీన్ని మంచి సంబంధంగా భావించడంతో తక్కువ మొత్తం ఇచ్చినట్లు చైనా రేడియో ఇంటర్నేషనల్ (సీఆర్ఐ) తెలిపింది. పెళ్లి కాకుండా మరణిస్తే శాపం చుట్టుకుంటుందనే విశ్వాసంతో వారికి పెళ్లి జరిపించడం అక్కడ పురాతన సంప్రదాయం.
అయితే ఇది మన దేశంలోనూ హైందవ సంప్రదాయ కుటుంబాలలో నిర్వహిస్తారు. అయితే దీనిని పెళ్లి కాని యువకులు పెళ్లీడు వచ్చిన తరువాత మరణిస్తే.. అతని కుటుంబసబ్యులు జిల్లేడు చెట్టుతో వివాహాలు జరిపిస్తారు. ఇలా చేసిన తరువాతే సదరు యువకుల మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే ఇవి హైందవ సంప్రదాయాలలో భాగంగా నిర్వహిస్తారే తప్ప.. చైనా మాదిరిగా అత్మలకు.. అమ్మాయిల శవంతో మాత్రం వివాహాలు జరిపించరు. పోయినోళ్లు ఎలాగో పోయారు.. ఇన్నాళ్లకు పెళ్లి చేసి.. లక్షల రూపాయలను విధిల్చుకోవడం ఉన్నవాళ్లకు పెనుభారంగా మారడం ఎలా సబబు అవుతుంది.
అయితే చైనాలో పాలీగమీ నెలకోంది అదేనండీ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య తక్కువగా వుంది. అందుకనే అక్కడి అమ్మాయిలకు.. అబ్బాయిల కన్నా డిమాండ్ అధికంగా వుంది, అబ్బాయిలు సింగిల్స్ డే రోజున వచ్చే ప్రపోజల్స్ ను కూడా అమ్మాయిలు తిరస్కరించేది ఇందుకేనోమో. అక్కడి అబ్బబాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇవ్వాల్సిందే. అదేనండీ కన్యాశుల్కం ఇవ్వాల్సిందే. కాగా ఇలాంటి దురాచారాలపై సంపూర్ణ నిషేధం విధిస్తే తప్ప మార్పు రాదని స్థానిక విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more