చంద్రబాబు నాయుడు ఈ మధ్యన తీసుకుంటున్న నిర్ణయాలు మరీ వింతగా అనిపిస్తున్నాయి. ఏకపక్షంగా సాగుతున్న పాలనకు తోడు .. తప్పుడు నిర్ణయాలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం సర్వత్రా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో ఉందని ఎప్పుడూ చెప్పుకునే అయ్యవార్లు తమ దుబారాను తగ్గించుకోవడం తెలియదు కానీ అడ్డగోలుగా దీని మీద పడితే దాని మీద పన్నులు వెయ్యడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇంతకీ తాజాగా అయ్యవార్లు దేని మీద పన్ను వేశారో తెలుసా..? గోమూత్రం మీద. అవును మీరు చదివింది కరెక్టే.. గోమూత్రం మీద పన్ను వేశారు.
ఏపీ వ్యాట్ చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద తయారవుతున్న ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్లే... గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు అందుకున్న గో ఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి.
గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని వాణిజ్య పన్నుల విభాగం తెలిపింది. గోమూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. గోమూత్రంపై ఏపీ వ్యాట్యాక్ట్ ప్రకారం 5శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. ఇలా ఏపి సర్కార్ తీసుకున్న అనుచిత నిర్ణయానికి ప్రజల నుండి వ్యతిరేకత రావడం పక్కా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more