ఏపిలోని నిరుద్యోగులకు తీపి కబురు అందింది. ఏపి సర్కార్ తాజాగా అక్కడ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను కూడా సంసిద్దం చేస్తోంది. దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి సమాచారం అందింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,250 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసు విభాగానికి చెందినవి 8 వేలుకాగా, మిగిలిన 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలోనే 1100 ఖాళీలతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఎఎస్) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇండెంట్లను బట్టి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఇండెంట్ అందిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.
తాజాగా ఏపీపీఎస్సీ నవీకరించిన వెబ్సైట్ను ప్రారంభించింది. గతానికి భిన్నంగా తొలిసారి ‘వన్టైమ్ రిజిసే్ట్రషన్’ కు ఏర్పాటు చేశారు. ఇందులో డిపార్ట్మెంటల్ టెస్ట్లకు సంబంధించిన విభాగాన్ని ఓపెన్ చేశారు. జూన్లో నిర్వహించే పరీక్షలు రాయగోరు అభ్యర్థులు తమ వివరాలతో రిజిసే్ట్రషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్లకు సంబంధించిన విభాగాన్ని తొలి నోటిఫికేషన్ విడుదల చేయగానే ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-1, 2, 4లకు సంబంధించిన సిలబ్సలో మార్పులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిలబ్సపై వచ్చిన 1,234 అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులకు ఏపీపీఎస్సీ పంపించింది. నివేదిక రాగానే మారిన సిలబ్సను తెలియజేస్తామని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more