హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో జరిగిన ప్రమాదంలో దేవీ మృతి మిస్టరీ వీడింది. ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీని కావాలని ఎవరో చంపారని, చంపి ప్రమాదంగా సృష్టించారని దేవీ తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. రాష్ట్రం మొత్తం ఈ విషయం చర్చనీయాంశమైంది. పలువురిపై పలు అనుమానాలతో దేవీ మృతి మిస్టరీగా మారింది. దీనిని ఛేదించడానికి పోలీసులు స్పెషల్ ఇన్వేస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. పూర్తి వివరాలను సీపీ మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆయన మాటల్లోనే... ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించాకే ప్రమాదమని తేల్చామని చెప్పారు. అనుమానితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించామన్నారు. సంఘటన జరిగిన రోజు దేవి, భరత సింహారెడ్డి హాజరైన పార్టీకి వచ్చిన వారందరి కాల్ డేటాన్ విశ్లేషించామన్నారు. ఆరోజు పార్టీకి ఎవరెవరు వెళ్లారో, ఏం జరిగిందో అంతా పరిశీలించామని చెప్పారు. దేవీ శరీరంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో ఏర్పడినవేనన్నారు. ఈవిషయమై మెడికల్, ఫోరెన్సిక్, సైంటిఫిక్ నిపుణులను సంప్రదించామన్నారు. కాగా, పబ్ లో పార్టీకి వారం ముందు నుంచే భరత్ సింహారెడ్డి ప్లాన్ చేశాడని, ఆ పార్టీకి వస్తావా అని అప్పుడే దేవినీ అడిగారని చెప్పారు. మరో స్నేహితురాలు సోనాలి కూడా ఆ పార్టీకి వస్తానని చెప్పడంతో దేవి కూడా ఆ పార్టీకి వెళ్లేందుకు అంగీకరించిందన్నారు. భరత్ సింహారెడ్డి మద్యం తాగి కారు డ్రైవ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని చార్జీషీట్ దాఖలయ్యే వరకు విచారణ జరుపుతామని సీపీ మహేందర్ రెడ్డి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more