ఎన్నికలు వస్తే తమిళనాట హామీలు, హడావిడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడులో జరిగినంత రాజకీయం, ఉచిత హామీలు ఎక్కడా కూడా ఉండవని అనుకుంటా. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో తాము గెలిస్తే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందిస్తామని, మహిళలకు 50% రాయితీపై స్కూటర్లనూ అందిస్తామని పేర్కొంటూ అధికార అన్నా డీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పలు ‘ఉచిత’ హమీలను ప్రకటించారు. పొంగల్ పండుగ సమయంలో కో-ఆప్టెక్స్ నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి రూ.500 విలువచేసే కూపన్లు పంపిణీ చేస్తామన్నారు.
మేనిఫెస్టోలోని మరికొన్ని ప్రధాన అంశాలు..
2015-2021 వరకు రైతులకు రూ.40 వేల కోట్ల పంట రుణాలు అందజేత. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ పూర్తిగా తగ్గింపు
పశువుల కోసం మెడికల్ షాపులు, శాఖల ఏర్పాటు. పాలు నిల్వ ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీజర్ల ఏర్పాటు
అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసీయూల ఏర్పాటు. మహిళలకు ఫుల్ బాడీ చెకప్ పథకం అన్ని జిల్లాలకూ విస్తరణ. వృద్ధులకు అన్ని ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో ఉచితంగా వైద్యం. గర్భిణులకు ఇచ్చే రూ.12 వేల భత్యం రూ.18 వేలకు పెంపు
డాక్టర్ అంబేద్కర్ ఆశయ లక్ష్యం కోసం రూ.5 కోట్ల వ్యయంతో ప్రత్యేక ఫౌండేషన ఏర్పాటు
చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న విద్యుత్ 200 యూనిట్లకు పెంపు. మరమగ్గాలు నేసే చేనేత కార్మికులకు 750 యూనిట్ల ఉచిత విద్యుత్.
ప్రభుత్వ కేబుల్ టీవీ కనెక్షన ఉన్నవారందరికీ ఉచితంగా సెట్టాప్ బాక్స్ పంపిణీ
..కాగా, తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోతో పాటు త్వరలో పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జయ ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పుదుచ్చేరిలోని నాలుగు రీజియన్లకు చెందిన ప్రజలు మెప్పించేలా, నాలుగు ప్రాంతాలను సమాన దృష్టితో అభివృది చేసేలా ఈ మేనిఫెస్టోను తయారు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more