వైసీపీ ఎమ్మెల్యేలకు తప్పిన భారీ ప్రమాదం..?! | Great escape of YSRCP MLA in Shamshabad

Ysrcp escaped from major accident in hyderabad

YSRCP, YSRCP MLAs, Jagan, Shamshabad, Hyderabad, Modi, President, Chandrababu Naidu, జగన్, వైసీపీ, మోదీ, హైదరాబాద్, శంషాబాద్

YSRCP escaped from major accident in Hyderabad. YSRCP MLAs tried to fly to delhi through shamshabad air port. In air plane there is a technical problem so pilot landed plane.

వైసీపీ ఎమ్మెల్యేలకు తప్పిన భారీ ప్రమాదం..?!

Posted: 04/25/2016 03:08 PM IST
Ysrcp escaped from major accident in hyderabad

వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ ప్రమాదం ముప్పు తప్పింది. ఏపి సర్కార్, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, అవినీతిని ఎండగొడుతూ సేవ్ డెమోక్రసీ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైసీపీ పార్టీకి చెందిన అందరు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఉదయం దిల్లీకి బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటా అని అనుకుంటున్నారా..? విమాన ప్రమాదం. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. విమాన ప్రమాదం నుండే వైసీపీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నారు.

నిన్న చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతిని వ్యతిరేకిస్తూ సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ నాయకులు ఈ ఉదయం 8.45గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దిల్లీ వెళ్లి మోదిని, రాష్ట్రపతిని కలిసి ఏపిలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు అవినీతి పాలన గురించి ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. కానీ శంషాబాద్ నుండి టేకాఫ్ తీసుకున్న విమానం వెంటనే అక్కడే తిరిగి ల్యాండైంది. విమానంలో ఏర్పడ్డ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇలా జరిగిందని తెలిసింది. అయితే అంత మంది ఎమ్మెల్యేలకు కానీ, ప్రయాణికులకు కానీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. మొత్తానికి పైలట్ అప్రమత్తతో వైసీపీ ఎమ్మెల్యేలు సేఫ్ గా ల్యాండయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles