ఉత్తరాఖండ్లో బిజెపి చేపట్టిన ఆందోళనను అణిచివేయడంలో ప్రభుత్వ అదేశాలను పాటించి,, తనపే ఓ పోలీసును ఎక్కించుకుని విధులు నిర్వహిస్తున్న అశ్వం శక్తిమాన్ పై బీజేపి ఎమ్మెల్యే దాడి చేయడంతో కాళ్లు విరగిపోయి చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. అశ్వం కోలుకోవాలని అనేక మంది చేసిన ప్రార్థనలు కూడా ఫలించలేదు. కాగా వైద్యులు శక్తిమాన్ కు కృతిమ కాలును అమర్చారు, కొన్నాళ్లకు అ కాలుపై లేచి నిలబడినా.. అశ్వం మానసికంగా కుంగిపోయింది, దీంతో గత కొన్నాళ్లుగా చికిత్స పోందుతున్న అశ్వం ఇవాళ అసువులు బాసింది.
మార్చ్ 14వ తేదిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనను అరికట్టడానికి వచ్చిన పోలీసులపై బిజెపి నాయకులు దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీస్ అశ్వమైన శక్తిమాన్పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గణేశ్ జోషి విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో శక్తిమాన్ కాలు విరిగిపోవడంతో వైద్యులు కాలును తొలగించారు. కాగా గత నెల రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్న శక్తిమాన్ నేడు తుదిశ్వాస విడిచింది.
శక్తిమాన్ మృతి చెందడంతో దాని సంరక్షకులు, మరియు పోలీస్ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో శక్తిమాన్పై దాడి చేసిన బిజెపి ఎమ్మెల్యే గణేశ్ జోషిని కఠినంగా శిక్షించాల్సిందేనని. ఈ విషయంలో రాజకీయ జోక్యం జరగకూడదన్న వాదనలను కూడా బలంగా వినబడుతున్నాయి. ఎమ్మెల్యేకు న్యాయస్థానం కఠిన శిక్ష విధించాలని నెటిజన్లు, జంతు ప్రేమికులు తమ అభిప్రామాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా శక్తిమాన్ మరణం పట్ల తాను చింతిస్తున్నట్లు చెప్పిన బీజేపి ఎమ్మెల్యే.. దాని మరణానికి మాత్రం తాను కారణం కాదంటున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more