బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబి నాయనలు.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నామన్నారు. తాము టీడీపీలో చేరడం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలిగించమని, అందరినీ కలుపుకుని పోతామని ఆయన హామీ ఇచ్చారు.
‘టీడీపీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ. మనమంతా ఇప్పుడు క్రమశిక్షణ గల పార్టీలో చేరుతున్నాం. ఆ క్రమశిక్షణను ఎన్నడూ దాటకుండా ప్రజలకు సేవలందించాలి. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో శ్రమిస్తున్నారు. ఆయన కృషి, పట్టుదలకు మనమంతా సహకరించాలి" అని సుజయ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేదన్న బాధ ఉండేదని.. ఇప్పుడు అది లేదని విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తనను కార్యకర్తగా వాడుకోవాలని బాబుకు విజ్ఞప్తి చేశారాయన. అలాగే విజయనగరం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎంను కోరారు సుజయ్ కృష్ణ రంగారావు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more