ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఏపిలో మొదటిసారిగా ఒకే రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత 68.05 శాతం, రెండో సంవత్సరం 73.78 శాతం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 5శాతం మెరుగ్గా ఫలితాలున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరంలో 2శాతం పాసింగ్ పెరిగింది.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు :
ఇంటర్ ఫస్టియర్లో బాలికలు 72.09 ఉత్తీర్ణత సాధించగా, బాలురు 64.02 సాదించారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాలు :
ఇంటర్ సెకండియర్లో బాలికలు 76.43 ఉత్తీర్ణత సాధించగా, బాలురు ఉత్తీర్ణత 71.12 సాధించారు.
ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more