మొన్న హైదరాబాద్ లో. తాజాగా నాగ్ పూర్ లో జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు మరో్మారు అదే తరహా పరాభవం ఎదురైంది, హైదరాబాద్ లోని సుందరయ్య కేంద్రంలో జరిగిన సమావేశాన్ని ఇద్దరు గో సంరక్షణ అడ్డుకుని కన్హయ్యపై చెప్పులు విసిరారు, సరిగ్గా అదే తరహాలో ఇవాళ తాజాగా నాగపూర్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ సమావేశంలోనూ అదే తరహాలో పరాభవం ఎదురైంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీ రసాభాసగా మారింది.
అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీ అనంతర సమావేశంలో కన్హయ్యకుమార్ పై చెప్పులు విసిరాడు, దీంతో అప్రమత్తమైన ఏఐఎస్ఎఫ్ నేతలు వెంటనే ఆ వ్యక్తిపై ప్రతిదాడికి పాల్పడ్డారు, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు నిందితుడని అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు కన్హయ్య ఎక్కగానే అగంతకులు అయనపై చెప్పులు విసరడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే జేఎన్ యూ, హెచ్ సి యూలలో విద్యార్థుల తరపున అంధోళనలో పాల్గన్న తాను చెప్పులు పోగోట్టకున్నానని భజరంగ్ దళ్, ఏబీవీపీ సంస్థలు బాగా గుర్తుపెట్టుకున్నాయని, ఇక బయట చేస్తే ఎండలు కూడా తీవ్రంగా వున్నాయని, ఇకపై తనపై చెప్పులు విసేరే వాళ్లు ఒకటి కాకుండా జోళ్లను విసరాలని చాకచక్యంగా సమాధానమిచ్చారు. ఇకపై తనపై చెప్పులు విసురేందుకు సన్నధమయ్యే వాళ్లు.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరో పాదరక్షల జోడీని అదనంగా తెచ్చుకోవాలని సూచించారు. అయితే తమ గురించి అబద్దాలను ప్రచారం చేసేవాళ్లు మాత్రమే తమపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. తాము నిజాలను చెప్పడం ప్రారంభిస్తే ఎక్కడ తమ పప్పులు ఉడకవనోనని అందోళనతోనే తమపై దాడులు జరుపుతున్నారని కన్హయ్య కుమార్ పరోక్షంగా బీజేపిపై విమర్శలు గుప్పించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more